సైనికకూటములలో  చేరవద్దు

సైనికకూటములలో  చేరవద్దు 

"సామాజిక అభ్యున్నతి కార్యక్రమాల కంటే సైనిక రక్షణ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి  కొనసాగిస్తున్న దేశం ఆధ్యాత్మిక మరణానికి చేరుకుంటుంది" - మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్.

                            ఈ నవంబరు నెల 6 న చుషుల్ లో జరిగిన 8 వ విడత కోర్ కమాండర్ స్ధాయి చర్చలలో, సరిహద్దులోని ఉద్రిక్తతలను తొలగించి, సైనిక ప్రతిష్టంబనకు తెరదించేందుకు భారత-చైనా దేశాలు ఒక అంగీకారానికి వచ్చే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. ఇది ఆహ్వానించదగిన పరిణామం. చర్చల వలన అంగీకారం కుదిరితే , వాస్తవాధీన రేఖ వద్ద మోహరించిన సైనిక, ఆయుధ వ్యవ స్దలను ఇరుదేశాలు ఉపసంహరించుకోవలసి వుంటుంది. మూడు దశలలో సైనికుల ఉపసంహరణ, యుధ టాంకులు, వాహనాలను , శతఘ్నులను  తరలించాలని , ఇరువైపులా మేనెలకు పూర్వమున్న పరిస్ధితులను పునరుధరించాలనే ప్రతిపాదనను ఇరువురూ ఆమోదించినట్లుగా తెలుస్తున్నది.త్వరలో జరిగే 9 వ విడత చర్చలలో ఒప్పందం కుదురుతుందని ఆశిద్దాం.  ఆరునెలలుగా భారత- చైనా సరిహద్దులలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్నిచల్లబరిచే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా పత్రికలు రాస్తున్నాయి. 

మరొక పక్క రెండో దఫా మలబార్ సైనిక విన్యాసాలు నవంబరు 17 నుండి జరుగుతున్నాయి. అమెరికా నాయకత్వాన జరుగుతున్న ఈ సైనిక విన్యాసాలలో భారతదేశం భాగమయింది. జపాన్‌, ఆస్ట్రేలియాలు కూడా పాల్గొంటున్నాయి. జపాన్‌ కొన్ని దీవుల విషయంలో చైనాతో వివాద పడుతోంది. అయితే వాటికోసం యుద్దానికి దిగేస్థితి లేదు. మరోవైపు అమెరికా ప్రభావం నుంచి బయటపడి స్వతంత్రశక్తిగా ఎదిగేందుకు, మిలిటరీశక్తిగా, మారాలని చూస్తోంది. ఆస్ట్రేలియా విషయానికి వస్తే అమెరికా అనుంగు దేశంగా మలబార్ సైనిక విన్యాసాలలో పాల్గొంటున్నది. 

చైనాను చుట్టుముట్టాల

మాన్యుఫాక్చరింగ్ రంగంలో చైనా  కొత్త దారులను తొక్కి అమెరికా తో సహా ప్రపంచప్రజలందరికీ కావలసిన వినియోగ వస్తవులను, ఎలక్ట్రానిక్ సామానులనుతయారుచేసి తక్కువ ధరలకు అందిస్తున్నది. ఈ పోటీకి నిలవలేక కస్టమ్స్ డ్యూటీ పెంచటంలో పోటీలుపడ్డాయి. చైనా తన మార్కెట్ ను, అధిక్యతను స్ధిరపరచుకుని,పెంచుకుని ఆర్ధిక శక్తిగా ఎదిగే ప్రయత్నంలోవుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ ద్వారా రవాణాసౌకర్యాలను అభివృధి చేసి ఆఫ్రికా, యూరప్ లతో తన వాణిజ్య వ్యాపారాలలో పైచేయిసాధింటానికి అమెరికా తో పోటీపడుతోంది. అందుకు అవసరమయిన ధనాన్ని ధారాళంగా వెచ్చిస్తున్నది. చైనా ప్రధాన అంతర్జాతీయ ఆర్ధిక శక్తిగా ఎదగటాన్ని అమెరికా సహించలేకపోతున్నది. చైనాను ప్రత్యర్ధి ఆర్ధిక శక్తిగానే కాక సైధాంతిక శత్రువుగా కూడా అమెరికా పరిగణిస్తున్నది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆధిక్యత సంపాదించి చైనాను చుట్టుముట్టడించి సైనికంగా దిగ్బంధించాలని అమెరికా ప్రయత్నం చేస్తున్నది. అందుకు మన సహాయంకోసం తీవ్రప్రయత్నం చేస్తుంది. క్రమేపీ సైనిక కూటమిలో చేర్చుకోవటానికి కుట్ర పన్న్నుతోంది. సైనిక విన్యాసాలని, వాతావరణ, ప్రదేశిక సమాచారాన్ని పంచుకు నే ” బెకా “అని రకరకాల ఒప్పందాలలో ఇరికించే ప్రయత్నాలలో వుంది.

అమెరికా దేశంతో మన సంబంధాలు ఎపుడూ లేనంత బాగున్నాయి.1947 సంవత్సరం నుండి ఇప్పటివరకూ అమెరికా తో మైత్రీ ఇంతలా లేదు. అమెరికా విదేశాంగ శాఖామంత్రి మైక్ పాంపియోతో పాటుగా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ 2x2 చర్చలు జరిపారు. మన దేశంతరపున భారతదేశ రక్షణ  శాఖా మంత్రి రాజనాధ్ సింగ్, విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. మిలిటరీ రంగంలో అమెరికా తో ఉ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా బేసిక్ ఎక్స్చేంజ్ అండ్  కో- ఆపరేషన్ అగ్రీమెంట్ “బెకా”  నుకుదుర్చుకున్నారు .

1998 లో భారత దేశం అణుపరీక్షలు నిర్వహించటం , అమెరికాకు కోపం తెప్పించింది, అమెరికా భారతదేశంపై తీవ్రమైన ఆర్ధిక ఆంక్షలను విధించింది. ఆనాటి విదేశాంగ శాఖా మంత్రి శ్రీ జైపాల్ సింగ్, అమెరికా విదేశాంగ మంత్రి టాల్బోట్ తో రెండు సంవత్సరాల కాలంలో 18 సార్లు చర్చలు సాగించారు.అనేక సంవత్సరాల చర్చలు, సర్దుబాట్లు, ఒప్పందాలు, లొంగుబాట్ల వలన 2005 సం,లోఆంక్షలను  క్రమంగా సడలించారు. పది సంవత్సరాల రక్షణ వ్యవహార సంబంధాల వ్యూహానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ ను భారత-అమెరికాలు ఏర్పరచుకొని 2013 లో రక్షణ వ్యవహారాల సహకారం పై  సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. . 2015 లో రక్షణ వ్యవహారాల వ్యూహ ఫ్రేమ్ వర్క్ ను మరో పదేళ్ళు పొడిగించారు.

ఈ వ్యూహ.ఫ్రేమ్ వర్క్ లో భాగంగానే భారత -అమెరికా మిలిటరీల  సంయుక్త విన్యాసాలతో పాటుగా ,విపత్తు ఉపశమనం, మానవతా సహాయం, సాంకేతిక బదిలీ,  మరియు ఇంటెలిజెన్స్ ఎక్స్ఛేంజ్ ఉమ్మడి శిక్షణ లన్నీ వున్నాయి.ప్రారంభంలో వ్యూహ కదలికలు నెమ్మదిగా ఉన్నాయి. భారతదేశం-అమెరికా  పౌర అణు ఒప్పందంతో 2008 లో అణు అడ్డంకిని అధిగమించిన తరువాత అది ఊపందుకుంది.

2000 సం లో 20 బిలియన్ డాలర్లున్న భారత- అమెరికా  ల వాణిజ్యం 2018 నాటికి 140 బిలియన్ డాలర్లకు చేరుకుంది .2005 సం . వరకు రక్షణ పరికరాలు 400 మిలియన్ డాలర్ల నుండి 18 బిలియన్ డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 

1991 లో బుష్- పీవీ నరసింహరావు గారు అధికారంలో వుండగానే అమెరికా కు దగ్గరకావటం మొదలయ్యింది. అణు పరీక్షల తరువాత అమెరికా అధ్యక్షుడి జిమ్మీ కార్టర్ 1978 లో భారత దేశంలో పర్యటించాడు. ఆ తర్వాత 22 సంవత్సరాలకు  ఫ్రధానమంత్రి వాజ్ పాయ్గ్ గారు డెమోక్రటిక్ పార్టీకి చెందిన అధ్యక్షుడు బిల్ క్లింటన్ ని ఘనంగా ఆహ్వానించారు. రిపబ్లికన్ అధ్యక్షుడు బుష్ తో మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం స్నేహసంబంధాలను పెంచుకుంటూ పోయింది.. 2008 లో అణు ఒప్పందంతో  ఉన్నత స్ధాయికి తీసుకెళ్ళింది.ప్రజాస్వామ్య దేశాల స్ధాయినుండి సహజ మిత్రుల స్ధాయికి చేరింది. 

సోవియట్ పతనం తో అంతరిస్తున్నఅలీన విధానం ,

అలీన విధానం భారత దేశ విదేశాంగ విధానంగా బారత ప్రభుత్వం 1947 నుండి 1991 వరకు కొనసాగించింది. నెహ్రూ అలీన దేశాలనాయకునిగా కొనసాగాడు. ఆసియా, ఆఫ్రికా దేశాల విముక్తిపోరాటాలకు అలీన ఉద్యమం సహాయాన్నందించింది.పంచవర్ష ప్రణాళికలకు సోవియట్ సహాయం అందించింది.భారీ పరిశ్రమలైన ఉక్కు ఫ్యాక్చరీలకు, భారత మందుల పరిశ్ఱమలకు నిస్వార్ధంగా సహాయాన్నిందించింది. 1971 లో ఇందిరా గాంధీ అలీన దేశాల సిధాంతాన్ని పక్కన పెట్టి సోవియట్ రష్యాతోశాంతి, స్నేహం, సహకార  ఒప్పందం చేసుకుని సోవియట్ రష్యాకు దగ్గరయింది. అలీన ఉద్యమం బలహీన పడటం, అలీనోద్యమ నాయకులైన నెహ్రూ, నాజర్, టిటో, కాస్ట్రో, సిరిమావో లు అంతరించటం  అమెరికా అనుకూల భావజాలానికి అడ్డు తొలగింది. అలీనోద్యమానికి సహకారాన్నందించిన సోవియట్ రష్యాను విఛ్ఛిన్నం చేయటంలో అమెరికా 

సఫలమయ్యింది. సాంకేతికంగా ఆధునిక టెక్నాలజీని సొంతం చేసుకున్న అమెరికా సైనిక బలంలోనూ తన అధిపత్యాన్ని నిరూపిస్తూ ఏకధృవ ప్రపంచానికి నాయకత్వం వహించింది. కార్పోరేట్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే, ఆర్ధిక సంక్షోభాలను నివారించలేకపోయింది.. అమెరికా దేశం అప్పులలో మునుగుతూంది. 906 బిలియన్ డాలర్ల అమెరికన్  ట్రెజరీ సెక్యూరిటీలు చైనా చేతిలో వున్నాయి.,  జపాన్ 877,  ఆయిల్ ఎగుమతిదారులు213 బిలియన్ డాలర్ల ట్రెజరీ సెక్యూరిటీలనుస్వంతం చేసుకున్నారు. అయినా డాలర్లను స్వంతంగా సృష్ష్టించుకునే అవకాశం వుండటంవలన  తాత్కాలికంగా తట్టుకుని నిలబడుతున్నది.  నిజ వేతనాలు క్రమేపీ తగ్గిపోతున్నాయి.నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. వైద్యరంగంలో వైఫల్యాల వలన లక్షలాదిమంది మరణిస్తున్నారు. జాతి వర్ణ వివక్షలు, ఘర్షణలు పెరుగుతున్నాయి. 

సోషలిజం, కమ్యూనిజం చర్చలోకివచ్చింది

అమెరికా లో నిరుద్యోగం, అసమానతలు పెరిగిపోవటంతో  సోషలిజం, కమ్యూనిజం . సోషల్ డెమోక్రసీ చర్చలోకివచ్చింది.ఆర్ధిక సంక్షోభాల సుడిగుండాలనుండి బయటపడటానికి మార్కెట్ల కోసం వెతుకులాటలో వుంది.  అమెరికా విదేశాంగ విధానం ముఖ్యంగా మిలిటరీ రీత్యా ఘోరంగా విఫలమయింది. వియత్నాం యుధం తరువాత సైన్యంలో చేరేపౌరులు కరువయ్యారు. ఇరాక్, ఆఫ్గనిస్ధాన్ లలో ఎదురైన పరాజయంతో ప్రత్యక్షయుధానికి వెనుకాడుతుంది. టెక్నాలజీ సహాయతో దొంగదెబ్బలు తీయటానికి ప్రాముఖ్యతనిస్తుంది.జనవరి 3, 2020 న ఇరాన్ మేజర్ జనరల్ ఖాసిమ్ సొలేమాన్ ని ద్రోన్ ద్వారా  సోవ్బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద  దొంగదెబ్బతీసి హతమార్చింది.


 భారతదేశంలాంటి దేశాలను తన వైపు చేర్చుకోవటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. భారత-చైనా సరిహద్దు తగాదా ఒక మంచి అవకాశంగా మలుచుకుంటున్నది. అయితే లాటిన్ అమెరికా దేశాల అనుభవాలు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి.

బిగుసుకుంటున్న బంధం ధ్రుతరాష్ట్ర కౌగిలి ని గుర్తుచేస్తున్నది. ప్రేమ నటిస్తూ దగ్గరకు తీసుకుంటూవుంటే ధ్రుతరాష్ట్ర కౌగిలి అంటారు. కురుక్షేత్ర ముగిసింది. పాండవులతో యుధ్ధం చేసిన కౌరవులంతా చనిపోయారు. ధృతరాష్ట్రుడు, గాంధారి బాధపడుతున్నారు. వాళ్లను పరామర్శించడానికి పాండవులు, కృష్ణుడు, కుంతి, ద్రౌపది వెళ్ళారు. బాధపడుతూనే గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు భీముణ్ణి దగ్గరికి పిలిచాడు. ఏది నాన్నా ఒక్కసారి నిన్ను కౌగిలించుకోవాలని ఉంది అంటాడు. కృష్ణుడు ఒక ఉక్కు భీముణ్ణి రెడీగా పెట్టించాడు. దాన్ని ఆ ముసలాయన ముందు ఉంచుతారు. ప్రేమతో కౌగిలించుకున్నట్టే గట్టిగా ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేస్తాడు. కపట ప్రేమ చూపించి మనుషులందరినీ విడగొట్టి నాశనం చేసే విష కౌగిళ్ళేవో తెలుసుకోవాలి.

ఇండో-పసిఫిక్ పాలసీ

ఇండో-పసిఫిక్ పాలసీ ని ముందుకు తెచ్చింది ట్రంప్ కాదు. ఒబామా , బిడెన్ అధికారంలో వుండగానే  ఈ విధానాలకు శ్రీకారం చుట్టారు. చైనా ప్రభావాన్ని ఆసియా దేశాలపై నివారించటానికి 2015 లో ఢిల్లీలో ఒబామా భారత-అమెరికా ల విజన్ స్టేట్ మెంట్ పై సంతకం చేశారు. అదే విధానాలను    ఆసియా పసిఫిక్ విదానాలుగాట్రంప్  కొనసాగించాడు. భారత -చైనా సరిహద్దు ఘర్షణలు అమెరికాకు  కలిసి వచ్చాయి.

నాటో సైనిక కూటమి స్ధానంలో క్వాడ్ సైనిక కూటమి

దక్షిణచైనా సముద్రంలో (సౌత్ చైనా సీ) నౌకా విన్యాసాలు చేసి ఆ ప్రాంతాన్ని మరొక సైనిక కూటమికి కేంద్రంగా చేయాలని 1992 నుంచి కొనసాగుతున్నాఅమెరికా ఊ్యూహం ఫలంచిందనే చెప్పాలి. నాటో సైనిక కూటమికి శత్రువైన సోవియట్ పతనం తర్వాత నాటో సైనిక కూటమి అవసరమే ప్రశ్నార్ధకమయ్యింది. శత్రువే అదృశ్యమైనపుడు ఎవరితో పోట్లాడోలో స్పష్టత లేనపుడు సైనికకూటములు బలహీనపడటం సహజమే. నాటోసభ్యదేశాలు అమెరికాకు దూరమవుతున్నాయి. నాటో కూటమి ఖర్చులు భరించే స్ధితి లో అమెరికా లేదు. సభ్యదేశాలైన,బ్రిటన్ , ఫ్రాంసు.జర్మనీ,కెనడా తదితరులను ఖర్చులను పంచుకోమని అమెరికా కోరవలసి వచ్చింది.  నాటో కూటమి కి నాయకత్వం వహిస్తున్న ఆమెరికా తోపాటు సభ్యదేశా లు కూడా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయాయి. సంక్షోభంలోనుండి బయటపడాలంటే ఆయుధాలను, యుధ విమానాలనూ, సైనికసామగ్రిని అమ్ముకోవాలి. నాటో సైనిక కూటమి స్ధానంలో క్వాడ్ కూటమిని స్ధాపిం చాలని అమెరికా ప్రయత్నాలు సాగిస్తూవున్నది. మలబార్ సైనిక విన్యాసాలు 1992 నుంచి కొనసాగుతున్నాయి. తొలిదశలో భారత-అమెరికా నౌకాదళాల శిక్షణాకార్యక్రమాలకు మాత్రమే పరిమితమని ప్రచారంచేశారు. 2015 సం.లో మలబార్ విన్యాసాలలో జపాన్ చేరింది. కొత్తగా ఆస్ట్రేలియాను భయపెట్టి, బతిమిలాడి క్వాడ్ అంటే చతుష్టయ కూటమిలోకి చేర్చుకొన్నారు. దక్షిణచైనా సముద్రాన్ని అధిపత్యం సంపాదించటంద్వారా ఆ ప్రాంతాన్నంతా పాదాక్రాంతం చేసుకోవచ్చని అమెరికా వ్యూ హం. 2015 సం.లో జరిగిన మలబార్ విన్యాసాలకు భారత్ నౌకాదళం రెండు యుధనౌకలను మాత్రమే పంపింది, ఇపుడు 2020 లో అత్యధిక విమానవాహక యుధనౌకలను, సబ్ మెరైన్ లను కూడా మన దేశం పంపింది

. చైనాను నిలవరించడానికి అమెరికా ఏర్పాటుచేసిన క్వాడ్ కూటమిలో అమెరికా, భారతదేశం, జపాన్ తోపాటుగా ఆస్ట్రేలియా కూడా చేరింది. ఈ నాలుగు దేశాలు కలిసి బంగాళాఖాతంలో నవంబర్ 3 మంగళవారం మలబార్ -2020 పేరున సైనిక విన్యాసాలు ప్రారంభించాయి.అరేబియా సముద్రంలో 17 వ తేదీనుండి 20వ తేదీ వరకు ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ విన్యాసాల లక్ష్యాలలో మొదటిది సౌత్ చైనా సీ పై ఆధిపత్యాన్ని సంపాదించి చైనా ను ఇరుకున పెట్టడం, భారతదేశాన్ని ఈ విన్యాసాలలోభాగం చేసి క్వాడ్ సైనిక కూటమిలో సభ్యునిగా చేర్చడ మే ధ్యేయంగా అమెరికా కృషిచేస్తూనేవుంది. భారత్ వంటి విశాలమైన మార్కెట్ వున్న  దేశం  తన  చెప్పుచేతల్లో వుండటం వలన వచ్తే ఆర్ధిక, సైనిక ప్రయోజనాలకోసం అమెరికా తపన పడుతోంది.

 చైనా ను చుట్టుముట్టి నిలవరించాలనే  (ఎన్సర్కిల్మెంట్ ఆఫ్ చైనా) పధకం 2007లో నే మొదలయింది.అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు డిక్ చెనీ, అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే ఈ పధకాన్ని ఆమోదించి "చతుష్టయాన్ని" ఏర్పాటుకు ప్రయత్నం  చేశారు. అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని జాన్ హోవర్డ్, భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దీనిని ఆమోదించారు. అమెరికా, భారత్  "ఎక్సర్సైజ్ మలబార్" పేర ఉమ్మడిగా నౌకా విన్యాసాలు జరుపుతున్నాయి. ఈ విన్యాసాలు 1992 నుంచి కొనసాగుతున్నాయి. జపాన్ నౌకాయాన ఆత్మ రక్షణ బలగాలతో కలిసి 2007లో జపాన్ దీవి ఒకినావాలో ఈ విన్యాసాలు నిర్వహించారు. బంగాళాఖాతంలో జరిగిన విన్యాసాలలో ఆస్ట్రేలియా, సింగపూర్ కూడా భాగస్వాములైనాయి. తద్వారా మలబార్ విన్యాసాలు ద్వైపాక్షిక ఒప్పందం పరిధిని దాటాయి. అయితే ఆస్ట్రేలియా 2008లో ఈ మలబార్ విన్యాసాల నుంచి ఉపసం హరించుకుంది. కాని ఆస్ట్రేలియా ఇతర చోట్ల అమెరికాతో సైనిక బంధాన్ని తెంచుకోలేదు. 2015 నుంచి జపాన్ క్రమం తప్పకుండా ఈ సైనిక విన్యాసాలలో పాలు పంచుకుంటోంది. మళ్లీ ఇప్పుడు నాలుగు దేశాలతో కూడిన చతుష్టయాన్ని పునరుద్ధించినందువల్ల భారత్ నిర్వహించే విన్యాసాలలో ఆస్ట్రేలియా కూడా భాగస్వామి అయింది.

ప్రశాంత సముద్రజలాలలో బలప్రదర్శనలు

చైనా ను నివారించ్చాలన్న అమెరికా ప్రయత్నాలకు మనం ఎందుకుసహకరించాలన్నదే

ముఖ్యమైన అసలుప్రశ్న. చైనాలో ఆర్ధిక అభివృది జరిగిన స్థాయి లో ఆ దేశ సైనిక,భౌగోళిక, రాజకీయ శక్తీ పెరగలేదు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇప్పటికీ అమెరికా దే పైచేయి. సైనిక బడ్జెట్, సైన్యం, అణ్వస్త్రాలు,  విదేశాల్లో  సైనికస్తావరాలు మొదలైన  వాటిలో ఏ  దేశమూ అమెరికా దరిదాపుల్లోకూడా లేదు.

అయినా చైనా బలమైనఆర్ధిక శక్తిగా ఎదగడంవలన బీజింగ్ కు ఇరుగు పొరుగున ఉన్న దేశాలలో పలుకుబడి పెరగటంవలన ఆసియా-పసిఫిక్  లో  అమెరికా అధిపత్యానికి భంగం కలిగింది.అమెరికా భధ్రతకు ముప్పు లేకపోయినా సవాలు మాత్రం ఎదురైంది.ఈ సవాలును ఎదుర్కోవటానికి భారతదేశాన్ని తన చెంతన చేర్చుకోవటానికి సరిహద్దు వివాదం ఉపయోగపడింది.అమెరికా సైనిక ఊ్యూహం లోకి లాగబడిన భారతదేశం దక్షిణచైనా సముద్రంలో అమెరికాకు ఉపయోగపడే నిఘాకు భారతదేశం అంగీకరించింది. సైనిక వ్యూహంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవులను కీలక మిలిటరీ కేెద్రంగా అభివృధి చేస్తున్నారు. బౌగోళికంగా ఈ దీవులు కీలక ప్రదేశంలో వున్నాయి. చైనా సముద్ర వాణిజ్య మార్గంలో కీలకంగా వుండే మలక్కా జలసంధికి అండమాన్ దీవులు సమీపంలో వున్నాయి. చైనా వ్యతిరేక సైనిక వ్యూహంలోఅండమాన్ దీవులు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి..

భారతదేశ నౌకలకు ఇంధనం నింపుకోవటానికి, యుధనౌకలను మరమ్మత్తు చేసుకునేందుకు ఇండోనేషియా, సింగపూర్ లతో ఒప్పందం చేసుకుంది.ఇండోనేషియాలో సబాంగ్ ఓడరేవును, సింగపూర్ లోని చాంగి నౌకాస్ధావరాన్ని, భారత్ లో యుధనౌకలువినియోగించుకునేందుకు యేర్పాట్లు జరిగాయి.ప్రశాంత సముద్రజలాలలో బలప్రదర్శనలు చేయటానికి మనదేశం అంగీకరించినందువలన సైనిక కూటములలో ప్రత్యక్షభాగస్వాములౌతున్నాము.

సత్ఫలితాలిచ్చిన 1988 భారత ప్రధాని రాజీవ్ పర్యటన

సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవటానికి ఉన్నత రాజకీయ , దౌత్య స్ధాయిలో చైనా తో భారత ప్రభుత్వ చర్చలు కొనసాగించటం వలన దాదాపు 40 సంవత్సరాలు భారత-చైనా దేశాలు తమ అభివృధిపై కేంద్రీకరించగలిగారు. ఆసియా టైగర్స్ గా ప్రసిధి పొందారు.

1988 డిసెంబరులో రాజీవ్ గాంధీ  చైనా పర్యటన, భారత చైనా దేశాల సంబంధాలలో ఒక చరిత్రాత్మక మలుపు. ఒక ముఖ్య ఘటన మాత్రమే కాదు.భారత చైనా దేశాల సంబంధాలను నూతన స్ధాయికి చేర్చింది. స్నేహానికి అడ్డంకులను తొలగించింది. చైనా భారత సరిహద్దు సమస్య ను శాంతియుతంగా స్నేహపూర్వంగా సంప్రదింపులద్వారా పరిష్కరించుకోవటానికి ఇరువురూ అంగీకరించారు. సరిహద్దు సమస్యకు పరిష్కారం కోసం  అనువైన వాతావరణాన్నిసృష్టించాలన్నారు. ఉమ్మడి సరిహద్దు కమిషన్ ను ఏర్పాటుచేశారు. సరిహద్దు సమస్యను  ఇతర ద్వైపాక్షిక సమస్యలనుండి వేరుచేశారు. సరిహద్దు వివాదం ఇతర సమస్యల పరిష్కారానికి అడ్డుకాకూడదన్నారు. అందుకనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో, వ్యాపార వాణిజ్యాలలో , ప్రజల మైత్రీ సంబంధాలలో గణనీయమైన అభివృధిని రెండు దేశాలు సాధించాయి. భారత చైనాలు కొద్దికాలంలోనే ప్రపంచానికి మార్గదర్శకులౌతారని భావించారు.  మిలిటరీ -  అమెరికానుఇండస్ట్రియల్ కాంప్లెక్స్ పరిపాలిస్తున్నది.

భారత-చైనా దేశ ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా ఇరు దేశాల నాయకులు ఉన్నత స్ధాయిలో రాజకీయ నిర్ణయాలు తీసుకుని సరిహద్దు సమస్యను పరిష్కరించాలి.  చెప్పుడు మాటలు విని యుధజ్వాలలలో మండిపోవటం అనర్ధం. వారెవరూ సైన్యాన్ని మనకు సహాయంగా పంపరు. ఆధునిక ఆయుధాలను మనకు అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఆయుధపోటీని పెంచుతారు. అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ చెప్పినట్లుగా అమెరికాను మిలిటరీ - ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ పరిపాలిస్తున్నది. అమెరికా లాగా మనం సైనిక-రక్షణ రంగ పరిశ్రమల (మిలిటరీ -ఇండస్ట్రియల్ కాంప్లెక్స్)  పరిపాలనలోకి వెళ్ళరాదు. కార్పోరేషన్లు-సైనికరంగం అమెరికా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని అమెరికా అధ్యక్షుడు తన పదవీ విరమణ సమయంలో వెల్లడించిన వాస్తవం ప్రపంచప్రజలందరికీ కనువిప్పు కావాలని యు.యస్ పౌరులను ప్రముఖంగా హెచ్చరించారు.  మిలిటరీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స వలన పెరుగుతున్నప్రమాదాల గురించి హెచ్చరించాడు.కానీ ఆయుధ రేసు ను నివారించలేకపోయాడు.

      “ తయారైన ప్రతి తుపాకీ, ప్రతి యుధ నౌక, ప్రయోగించిన ప్రతి రాకెట్ -ఆకలి బాధతో ఉన్నవారినుండి దొంగిలించినవే. ధరించటానికి దుస్తులు లేనివారు ఆయుధాలలో డబ్బు మాత్రమే ఖర్చు చేయటంలేదు. ఆయుధాల తయారీలో కార్మికుల చెమట, శాస్త్రవేత్తల మేధావితనంతోపాటు మన పిల్లల ఆశలు కూడా ఖర్చు చేస్తున్నాము.”    (ఏప్రిల్, 16, 1953న [డ్వైట్ డి ఐసెన్ హోవర్ .లి               

ఈ యుధాలు ఎవరికోసం ?

 రక్షణ పరిశ్రమలు నడవటంకోసం యుధాలుకావాలి. యుధాలకోసం అత్యంత ఆధునిక ఆయుధాలను తయారు చేయటానికి  ప్రపంచంలోని మేధావులను , సైంటిస్టులను అమెరికా ఆహ్వానించి ఆధునిక సౌకర్యాలను, అవకాశాలను, పని చెసే వాతావరణాన్ని సృష్టిస్తున్నది.  కొత్తకొత్త ఆయుధాలను తయారుచేసి ఇరుపక్షాలకు ఆయుధాలను అమ్ముకుంటున్నది. సోవియట్ పతనం తరువాతఎల్లపుడూ ఏదో ఒక యుధంలోవుండే అమెరికా కు కొత్త శత్రువు అవసరం వచ్చింది. ఆ వెతుకులాటలో ఇరాన్, ఇరాక్,లిబియా, సిరియా,  ఆఫ్ఘనిస్ధాన్ లు కొంత పని కల్పించాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతాన్ని తమ తదుపరి కార్యక్షేత్రంగా ఎంచుకుని పావులు కదుపుతున్నారు.

 రక్షణపరిశ్రమల కార్పోరేట్ కంపెనీలకు యుధాలు కావాలి. కార్పోరేట్ కంపెనీల ప్రయోజనాలను కాపాడే నాయకులకు పదవులు, కమీషన్ల కోసం యుధాలు కావాలి. ప్రజలకు తమ శ్రమకు పూర్తి ఫలంఅందాలి. ప్రజలకు ఉపాధి, ఆహారం, గృహం, విద్య, వైద్యం , మంచి జీవితం. అందుకోసం అనవసర యుధాలబారినుండి ధృతరాష్ట్ర కౌగిలి నుండి తప్పుకోవాలి. ప్రపంచ శాంతికోసం కృషిచేయాలి. 

అమెరికాతో సైనిక ఒప్పందాలు

కమ్యూనిస్టు చైనాను ఎదుర్కోవటానికి యుఎస్ఎ తన విదేశాంగ విధానంలో భాగంగా  భారతదేశాన్ని ప్రధాన రక్షణ భాగస్వాములలో ఒకటిగా చేసుకోవాలని కోరుకుంటోంది.

తన వ్యూహాత్మక ప్రయోజనాలకు సాధించటంలో భారతదేశం కీలకమని గుర్తించిన అమెరికా, భారత్‌తో తన సంబంధాన్ని బలోపేతం చేసుకోడానికి ప్రయత్నిస్తూనే వున్నది. ఆ ప్రయత్నాలు ఇప్పటికి సఫలమయ్యాయి. ప్రాధమిక ఒప్పందాల స్ధాయినుండి సైనిక ఒప్పందాల స్ధాయికి ఎదిగాయి. 

భారత్ దేశాన్ని అమెరికాకు భారీ రక్షణ భాగస్వామి గా చేసుకోవటం వలన భారత సైనిక స్ధావరాలను అమెరికా యుధవిమానాలు, యధనౌకలు వినియోగించుకోవచ్చు. అమెరికా లో ఆయుధాలు ఉత్పత్తి చేసే వారి దగ్గరనుండి భారత్ నేరుగా ఆయుధాలు కొనవచ్చు. 

అమెరికా తన రక్షణ భాగస్వాములతో నాలుగు "ప్రాధమిక బేసిక్ " ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. ఈ ఒప్పందాలు "భాగస్వామి-దేశాలతో సైనిక సహకారాన్ని పెంపొందించుకోడానికి అమెరికా ఉపయోగించే సాధారణ సాధనాలు" అని పెంటగాన్ అంటుంది. మనం ప్రాధమిక స్ధాయి ఒప్పందాలన్నీ చేసుకున్నాము. ఈ ఒప్పందాల వలన విమానాల్లోను, నౌకల్లోనూ ఇంధనం నింపడాన్ని, విపత్తు ఉపశమనం అందించడం వంటి కార్యకలాపాలను నిర్వహించడాన్నీ ఇది సరళతరం చేస్తుందని పెంటగాన్ అంటుంది. 

ఈ నాలుగు ఒప్పందాలలో మొదటిది, జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ (GSOMIA), 2002 లో భారత అమెరికాలు సంతకం చేసిన ఒప్పందం ఇది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సైనిక సమాచారాన్ని పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. 

రెండవ ఒప్పందం, లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (LEMOA), 2016 ఆగస్టు 29 న ఇరు దేశాలు సంతకం చేశాయి. పునఃసరఫరాలు చేయడానికి, మరమ్మతు చేయడానికీ ఇతరుల స్థావరాలను ఉపయోగించడానికి ఇరు దేశాల సైన్యానికి LEMOA ద్వారా వీలు కలుగుతుంది. 

మూడవ ఒప్పందం, కమ్యూనికేషన్స్ ఇంటర్ ఆపరబిలిటీ అండ్ సెక్యూరిటీ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ CISMOA. 2018 సెప్టెంబరులో  2 + 2 సంభాషణ సందర్భంగా భారత్ తరఫున మంత్రులు శ్రీమతులు సుష్మా స్వరాజ్, నిర్మలా సీరు. చైనా మరియు పొరుగు ప్రాంతాలపై నిఘా ఉంచడానికి, అమెరికా మిలిటరీ పరికరాలను కొనటానికి,  టెక్నాలజీని  ఇవ్వటానికి , ఆయుధాలను భారతదేశానికి అమ్మటానికి  2 + 2 ద్వైపాక్షిక సదస్సులో సంతకాలు చేసారు. 

నాల్గవ ఒప్పందం  బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ (బీకా). ఇది జియోస్పేషియల్ ఉత్పత్తులు, టోపోగ్రాఫికల్, నాటికల్, ఏరోనాటికల్ డేటా, యుఎస్ నేషనల్ జియోస్పేషియల్-ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్జిఎ) ఉత్పత్తులు సేవలను మార్పిడి చేయడానికి అనుమతిస్తుంది. 

లండన్లోని కింగ్స్ కాలేజీలో అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్ హర్ష్ వి. పంత్ అమెరికా వ్యూహాత్మక ప్రణాళికలో భారతదేశపు ప్రాముఖ్యతను  ఎత్తిచూపాడు: "ఇండో-పసిఫిక్ లో శక్తి  సామర్ధ్యాల సమతుల్యతకు  అమెరికాకు భారతదేశం కీలకం. వనరుల పరిమితంగా ఉన్న ఈ సమయంలో, చైనా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో తన విశ్వసనీయతను పెంచుకోడానికి అమెరికాకు భారతదేశం వంటి భాగస్వాములు అవసరం." ఈ ఒప్పందాలన్నిటిలో భారత్  చేరింది. నాటో కూటమి లోని భాగస్వామ్యదేశాలన్నీ ఈ విధంగా సంతకాలు చేసి నాటో సైనిక కూటమి లో చేరి ఇరుక్కు పోయిసంక్షోభాలలో చిక్కుకుని దివాళా తీశారు. 


.  జపాన్, ఆస్ట్రేలియా దేశాలు అమెరికాకు సహజ సైనిక మిత్రులు. ఈ ముగ్గురితోపాటుగా భారతదేశాన్ని కలుపుకుని క్వాడ్ అంటే నలుగురు లేక చతుష్టయం అనే ఒక సైనిక కూటమిని ప్రారంభించారు, అమెరికాకు మిలిటరీ స్ధావరాలున్నాయి. ఈ ఒప్పందాలవలన సైనిక బంధాలు పెరిగి పరస్పర సహాయ సహకారంతో నౌకాశ్రయాలను వినియోగించుకోవటం, నౌకలకు, విమానాలకు ఆయిల్ నింపుకోవటం, రిపేర్లు చేసుకోవటంలాంటి మిలిటరీ సౌకర్యాలు ఒప్పందంలోని భాగస్వాములందరికీ లభిస్తాయి.  గత సంవత్సరం  క్వాడ్ ను మంత్రుల స్ధాయకి పెంచి న్యూయార్క్ లో నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. రెండవ సమావేశం టోక్యోలో ఈ సంవతంసరం అక్టోబర్ లో జరిగింది. చైనానుండి, చైనా కమ్యూనిస్టుపార్టీ దోపిడీ, అవినీతి నుండి  క్వాడ్ లో భాగస్వాములుగా వున్నటువంటి దేశాల ప్రజల రక్షణ కోసం క్వాడ్ ఏర్పడిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ,టోక్యో లో భాహాటంగా ప్రకటించాడు. అమెరికా లో కమ్యూనిస్టువ్యతిరేకతను రెచ్చగొట్టిన ఘనత   రిపబ్లికన పార్టీ సెనేటర్ మెకార్ధీకే దక్కుతుంది. ప్రభుత్వం లోవున్నప్రజాస్వామికవాదులందరినీ కమ్యూనిస్టులన్నాడు. సోవియట్ ఏజెంట్లు అంటూ వారందరిపై పై దాడి చేశాడు.వారిని పదవులనుండి తొలగించేదాకా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేశాడు. అమెరికన్ ప్రజలలో కమ్యూనిస్టలంటే భయాన్ని, వ్యతిరేకతలు సృష్టించాడు.  అతను కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నిజమైన సాక్ష్యాలను చూపించటంలేదని అందరికూ తెలుసు.. అయినా అతని అబధాల ప్రచారాన్ని ఆపడానికి ఐసెన్ హోవర్ లాంటి వారు కూడా భయపడ్డారు.” నేను ఆ వ్యక్తితో గొడవపడను” అని ప్రెసిడెంట్ ఐసెన్హోవర్ మెకార్ధీ గురించి చెప్తూ వెనక్కితగ్గాడు. 1950 లో ప్రారంభమయిన కమ్యూనిస్టు వ్యతిరేకత ఇంకా కొనసాగుతూనే వుంది. కమ్యూనిజాన్నినివారించాలనే పేరుతో కొరియా, వియత్నాం యుధాలనుండి ఇండో-పసిఫిక్ క్వాడ్ కూటమి వరకూ  సైనిక కూటములను ఏర్పరుస్తున్నారు. మిలిటరీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ తన కార్పోరేటె సామ్రాజ్యాన్ని స్ధిరపరచుకుంటూ ఆయుధాలను అమ్ముకుంటూ ప్రపంచప్రజలను అధర్మ యుధాలలోకి లాగుతున్నది. ఆధునిక కాలంలో సాగిన  యుధాలన్నిటిలోనూ   కొరియా యుధంలో  1950-53సం. కాలంలో 20-30లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రెండవ ప్రపంచయుధ మరణాల కన్నా,హిరోషిమా నాగసాకి అమెరికా అణ్వాయుధ బాంబుల దాడికి మించి,  వియత్నాం యుధాన్నికూడా మించి లక్షలాదిమంది  కొరియా పౌరులు కార్పెట్ బాంబింగ్ వలన చంపబడ్డారు.  

 ఎక్కువ స్నేహంతో జీవించవలసిన ఇరుగు పొరుగు దేశాలమధ్య చిచ్చు పెట్టి ఇద్దరికీ ఆయుధాలను, ఫైటర్ విమానాలను, సబ్ మెరైన్లను అమ్ముకోవటమేకాకుండా ప్రపంచ ప్రజలనందరినీ పేదరికం లోకి నెట్టి అసమాన అభివృధిని సృష్టిస్తోంది. అమెరికా దేశం సంవత్సరానికి 732 బిలియన్  డాలర్లను , చైనా 261 బిలియన్  డాలర్లను, ఇండియా 71 బిలియన్  డాలర్లను మిలిటరీకి, ఆయుదాలకు ఖర్చుపెట్టి ఫ్రపంచ ప్రజల పేదరికాన్ని పెంచుతోంది. ఆయుధాలలో డబ్బు మాత్రమే ఖర్చు చేయటంలేదు. [డ్వైట్ డి ఐసెన్ హోవర్  అన్నట్లుగా ఆయుధాల తయారీలో కార్మికుల చెమట, శాస్త్రవేత్తల మేధావితనంతోపాటు మన పిల్లల ఆశలు కూడా ఖర్చు చేస్తున్నాము.”    (ఏప్రిల్, 16, 1953న [డ్వైట్ డి ఐసెన్ హోవర్ ప్రసంగం).


చైనా మనను జయించలేదు. మనం చైనాను జయించలేము. 


చైనా మనను జయించలేదు. మనం చైనాను జయించలేము. ఆదునిక సాంకేతిక జ్ఞానంతో , అభివృధిచెందిన ఆయుధాలను ప్రయోగించి ,అత్యంత శక్తివంతమైన యుధతంత్రంతో అమెరికా ఏదేశంలోనూ విజయం సాధించలేదు. 2001 సెప్టెంబరు 11 న ప్రపంచవాణిజ్యసంస్ధపై దాడి జరిగినప్పడినుండీ 20 సంవత్సరాలుగా , ఆసియాలో ప్రతీకారయుధాలను అమెరికా సాగిస్తుంది. ఈ యుధాలకు 6.4 లక్షల కోట్ల డాలర్లు ( 475 లక్షల కోట్ల రూపాయలు ) ఖర్చయిందని అంచనా. గత 20 సంవత్సరాలుగా అమెరికా సాగించిన యుధాలలో చనిపోయిన వారి సంఖ్య 8,01,000. అందులో 3,35,000 మంది నిరాయుధ పౌరులన్నది మరింత బాధాకరం. కొరియా, వియత్నాం లలో చావు దెబ్బతిన్న అమెరికా పాఠాలు నేర్చుకోకుండా మిలిటరీ -ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అడ్డుపడింది. ప్రత్యక్షంగా సైనికులను ఆకాశంనుండి క్యూబా లో దించి అవమానాల పాలయ్యింది.ఇరాక్ లో సద్దామ్ హుస్సేన్, చిలీ లో అలెండీ, లిబియాలో కల్నల్ గద్దాఫీ, ఇరాన్ జనరల్ క్వాసిమ్ సొలేమాన్ లను దారుణంగా హత్య చేసింది. క్యూబా అధినేత ఫిడేల్ కాస్ట్రోను చంపటానికి 638 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. అటువంటి చరిత్ర కలిగిన అమెరికా ను నమ్ముకుని 

యుధకూటములలో చేరితే మన దేశం ఆర్ధికంగా నష్టపోయి అరబ్ దేశాలు,  లాటిన్ అమెరికా, ఆసియా.ఆఫ్రికా దేశాలలోలాగా  అభాసుపాలవుతాము. కుక్క తోక పట్ట్టుకుని గోదావరి ఈదటం సాధ్యంకాదు.

 ఆసియాలో అమెరికా భౌగోళిక రాజకీయ ఊ్యూహానికి భారత్ తలొగ్గాల్సి రావటం విచారకరం. కొన్ని వేల సంవత్సరాలు సాగిన భారత-చైనా మైత్రి లో  యుధాలు లేవు.  వలస పాలకులు సృష్టించిన సరిహద్దువివాదాన్ని భారత-చైనా దేశాలు పరిష్కరించుకోవటానికి చేసే ప్రయత్నాలను ఆయుధ వ్యాపార కార్పోరేట్ కంపెనీలు, వారిపై ఆధారపడిన ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. రాబోయే కాలానికి భారత-చైనా దేశాలే సాంకేతిక అభివృధికి చిహ్నంగా వుంటాయని నిరూపించుకుంటున్నారు. అటువంటి సమయంలో సరిహద్దు ఘర్షణలు జరగటం అవాంఛనీయం. వలసరాజ్యాలువదిలి వెళ్ళిన సరిహద్దు వివాదాన్ని పరిష్కరించకోలేకపోవటం భారత - చైనాదేశాల రాజకీయ వైఫల్యం. భారత చైనాలు చిరకాలం శత్రుత్వంతో వుండలేవు. వేలాది సంవత్సరాల సుదీర్ఘ మైత్రిలో తగాదాపడిన కాలం చాలా తక్కువ. పరిష్కరించుకోలేని సమస్యలు లేవు.  ప్రపంచంలో వేగంగా అభివృధిచెందుతున్న అతి పెద్ద దేశాలైన  భారత- చైనా లతోనే ప్రపంచ ప్రజల సుస్ధిర శాంతి సౌభాగ్యాలు ముడిపడివున్నాయి.. 

భారత దేశం సైనిక కూటములలో చేరవలసిన అవసరం వున్నదా లేదా అని మనం ఆలోచించాలి. సైనిక కూటములలోచేరి చితికిపోయిన దేశాల చరిత్రను మరువరాదు.  మన దేశంలో ఒక  ప్రాంతంలో స్ధానికంగా ఏర్పడిన తగాదాను స్ధానిక తగాదాగానే పరిమితం చేసి మన ప్రాంతాన్ని రక్షించుకోవాలి. అందుకవసరమయిన చర్యలన్నీతీసుకోవాలి.  

ఉన్నత స్ధాయిలో రాజకీయ నిర్ణయాలు తీసుకుని సరిహద్దు సమస్యను పరిష్కరించాలి.

18-11-2020

డాక్టర్ కొల్లా రాజమోహన్,  భారత-చైనా మిత్రమండలి, ఆంధ్రప్రదేశ్, మాజీ అధ్యక్షుడు. (1982-1997) 


Write a comment ...